- Advertisement -
తెలుగు రాష్ట్రాలపై అంతర్జాతీయ హ్యాకర్లు పంజా విసిరారు. ఏపీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్సైట్స్పై తమ ప్రతాపం చూపించారు. టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్, ఎపీ ఎస్పీడీసీఎల్ వెబ్ సైట్లను ర్యాన్సమ్ వేర్ వైరస్ తో దాడిచేశారు. ఈ కంప్యూటర్లలోని సమాచారం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. దాదాపు రూ.35 కోట్లు చెల్లిస్తే కంప్యూటర్లను అన్ లాక్ చేస్తామని స్పష్టం చేశారు.
అయితే డాటా అంతా బ్యాకప్ ఉండటంతో రెండు తెలుగురాష్ట్రాల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.డిస్కం వెబ్సైట్స్ హ్యాకింగ్పై సీసీఎస్ పోలీసులకు TSSPDCL ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు