తన మెడలో తాళి కట్టి మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను సఫారి ఇచ్చి మరీ భార్య చంపించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన స్వప్నకు ఇదివరకే వివాహం జరిగింది. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఉప్పల్లోని ఒక వస్త్రదుకాణంలో ఆమె పని చేస్తున్నది.
ఆంధ్రపదేశ్ లోని తిరుచినార్కు చెందిన కంచికట్ల శ్రీనివాస్ హైదరాబాద్కు వలస వచ్చాడు. తొలుత ఆటో డ్రైవర్గా పని చేశాడు. స్వప్నతో శ్రీనివాస్కు పరిచయం ఏర్పడింది. అనంతరం వీరు వివాహం చేసుకున్నారు. కొంత కాలంగా శ్రీనివాస్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి ఉందామని స్వప్నను బలవంతపెడుతున్నాడు.
ఈ క్రమంలో శ్రీనివాస్ను చంపాలని స్వప్న నిర్ణయించుకుంది. దీంతో తన అక్క కుమారుడు పోశెట్టితో కలిసి శ్రీనివాస్ను హతమార్చాలని నిర్ణయించుకుంది. సఫారీ ఇవ్వాలని పోశెట్టి స్పప్నకు సూచించాడు. ప్రవీణ్కుమార్ అనే వ్యక్తికి రూ.5లక్షల సపారిని ఇచ్చారు. ఇటీవల వీరు వేంపేటకు వచ్చిన సందర్భంలో ప్రవీణ్ సాయంలో శ్రీనివాస్ తలపై రోకలి బండతో మోది చంపారు.
ఇక మత్తు వదలాల్సిందే.. సర్కారు కీలక నిర్ణయం
ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు
బెదిరిస్తున్నారు చర్యలు తీసుకోండి టీం ఇండియా మాజీ కెప్టెన్ ఫిర్యాదు