నీతా అంబానీ. పరిచయం అవసరం లేని మహిళ. అంబానీల కుటుంబానికి పెద్ద దిక్కు. ఫోర్బ్స్ ఆసియా ప్రాంతపు అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. అందులో తొలిస్ధానాన్ని నీతూ అంబానీ కైవసం చేసుకున్నారు. కాగా రెండో స్ధానంలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య నిలిచారు.
14 స్ధానంలో మ్యూ సిగ్మా సిఈవో అంబికా ధీరజ్, వెల్ స్పన్ ఇండియా సిఈవో దీపాలి గోయెంకా 16 స్ధానంలోనూ, 18 స్ధానంలో లుపిన్ సిఈవో వినితా గుప్తా, ఐసిఐసిఐ ఎండి, సిఈవో చందా కొచర్ 22 స్ధానంలోనూ నిలిచారు. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యం నానాటిక విస్తరిస్తూండడం, అందులో నీతా అంబానీ పాత్ర ఎక్కువగా ఉండడంతో ఈసారి ఆమె మొదటి స్ధానాన్ని దక్కించుకున్నారని ఫోర్బ్స్ సంస్ధ తెలిపింది. దీంతో ముంబయి ఇండియన్స్ క్రికెట్ టీం నీతా దాదాపు 112 మిలియన్ డాలర్లు వెచ్చించారని, అందుకే నీతా అంబానీకి తొలి స్ధానం దక్కిందని కూడా సంస్ధ పేర్కొంది.