దేశంలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడం పదుల సంఖ్యల్లో మరణించడం జరుగుతుంది. తాజాగా బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో… ట్రక్కును ఢీకొట్టింది. కటిహర్ జిల్లాలోని కుర్షేలా సమీపంలో 31 వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కటిహార్ ఎస్డీపీవో అమర్ కాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది సభ్యుల బ్యాండ్ బృందం పూర్నియా నుంచి ఆటోలో బయలు దేరారు.
కుర్షేలా సమీపంలోకి రాగానే.. ఎదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలిలోనే మృతి చెందాగా.. మరొకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రక్కును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
ఘటన తర్వాత కారు డ్రైవర్ పరారైనట్లు అమర్కాంత్ తెలిపారు. మృతులు.. అర్జున్ మోచి(50), కిశోర్ పాస్వాన్(45), ధర్మేంద్ర కుమార్ మండాల్(50), సుశీల్ కుమార్ మోచి(30), చోటేలాల్ రామ్(42)గా గుర్తించినట్లు కటిహార్ సామాజిక వైద్యశాల డాక్టర్ అనుపమ్ అలోక్ తెలిపారు. వీరంతా మజ్దిహా గ్రామానికి చెందిన వారిగా తెలిపారు.