మెగా కుటుంబం నుంచి ఏంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆ సినిమాయే తెలుగు తెరపై ప్రస్తుతం సంచలనం సృష్టింస్తున్న ఉప్పెన మూవీ. ఇటీవలే విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లతో వెండితెరపై ఉప్పెనలా దూసుకుపోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా వెండితెర సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు ఉప్పెన సినిమాపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా సూపర్ “క్లాసిక్” అంటూ మహేష్ కొనియాడారు. అలాగే, సినిమా డైరెక్టర్ ను ఆకాశానికి ఎత్తుతు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించాడు. బుచ్చిబాబు సానా.. మీరు తీసిన ఈ చిత్రం అత్యంత అరుదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుందని ప్రిన్స్ పేర్కొన్నాడు.
అలాగే, ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలు మొదటి సినిమాతోనే అద్భుతంగా నటించారని అభినందించారు. కళ్లు చెదిరేలా నటించి.. ఇద్దరు స్టార్లు అయ్యారని తెలిపారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. డీఎస్పీ మీరు ఇప్పటివరకు సంగీతం అందించిన చిత్రాల్లో ఉప్పెన అత్యుత్తమమైనది. మీరు ఇదే ఒరవడి సృష్టిస్తూ దూసుకుపోవాలి అంటూ సూపర్ స్టార్ తెలిపారు.
దుబాయ్ పోలీస్ స్టేషన్లో హీరో మహేష్ బాబు!
నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఇలా పోగొట్టుకోండి..