Monday, April 29, 2024
- Advertisement -

విషాదం నింపిన వివాహ వేడుక.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

- Advertisement -

వివాహ వేడుక వారి జీవితాల్లో విషాదం నింపింది. స్నేహితుడి వివాహానికి వెళ్లి ఆనందోత్సాహాలతో తిరిగి వస్తున్న ముగ్గురిని రోడ్డు ప్రమాదం రూపంలో మ్రుత్యువు కబలించింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మర్చాల సమీపంలో చోటు చేసుకుంది.

మహబూబాబాద్, నల్లొండలకు చెందిన మిత్రులంతా కలిసి తమ స్నేహితుడి వివాహానికి అని ఫిబ్రవరి 17న కారులో నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలానికి వెళ్లారు. వివాహం అనంతరం ఫిబ్రవరి 18న తిరిగి కారులో తిరుగి ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో కారు ఒక్కసారిగా కల్వర్ట్ ను ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

చనిపోయిన వారిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. వీరిని కిరణ్మయి, శిరీష, అరవింద్ గా గుర్తించారు. అయితే కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయి. దీంతో మధ్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -