- Advertisement -
విజయవాడ: ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు తరుపు న్యాయవాధి కొత్త వాదన వినిపించారని ఆశ్చార్యాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ.
ఓటు వేసేందుకు నోటు తీసుకోవడం అవినీతి నిరోధక చట్టం పరిథిలోకి రాదని చంద్రబాబు లాయర్ సిద్దార్ధ అనడం వింతగా ఉందని అన్నారు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడం తప్పు కాదన్నట్టు ఆయన ఆయన హైకోర్టులో వాదనలు వినిపించడం ఆశ్చర్యకరం అన్నారు. ఓటుకు నోటు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అని ఉన్న వాయిస్ నాది కాదని చెప్పడం లేదని విమర్శించారు. తాను నిప్పులాంటి వాడినని, ఛాలెంజ్ చేస్తున్నానని అనడం కాకుండా, ఐపీసీ సెక్షన్ కింద కేసు పెట్టడం కుదరదని చెప్పడం విడ్డూరం అని బొత్స అన్నారు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో ఉంటూ ఇటువంటి వాదనలు చేయడమేంటని.. జాతికి, వ్యవస్థకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని బొత్స ప్రశ్నించారు.