వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పాలన పై జనాల్లో పూర్తిగా నమ్మకం ఉంది. రైతులు, మత్స్యకారులకు జగనన్న ప్రభుత్వం అండగా నిలబడింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో జగనన్న ప్రభుత్వం ఎన్ని గొప్ప పనులు చేసిందో అందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థ వృద్దులకు ఏ స్థాయిలో సాయం చేసిందో అందరూ చూశారు. సంక్షేమ పథకాలతో కూడా మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలబడ్డారు జగనన్న. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ తమ ఓటు జగన్ ప్రభుత్వానికే అంటూ ప్రజలు ప్రత్యర్థి పార్టీలకి గట్టిగా సమాధానాలు చెబుతున్నారు.
ఇదే టీడీపీ పార్టీని వణికిస్తుంది. దీంతో వారు ఫ్రస్ట్రేట్ అయ్యి చేస్తున్న ఘోరాలు అన్నీ ఇన్నీ కాదు. ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఆపించేశారు. మహిళలపై టీడీపీ దాడులు చేయిస్తున్నారు.మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ్య పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. నిన్న హోంమంత్రి తానేటి వనతిపై గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో దాడి జరిగింది. విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై దాడి చేయడం కూడా సంచలనం రేపింది.అంతకుముందు మంత్రి బాలినేని కోడలుపై ఒంగోలులో దాడి. ఇవన్నీ టీడీపీ శ్రేణుల పిరికితనానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు.