- Advertisement -
గత కొద్ది రోజులుగా టీవీ ప్రేక్షకులను తీవ్ర గందర గోళానికి గురి చేస్తున్నారు కేబుల్ ఆపరేటర్లు. వీరికి పలు ఛానెల్ వారు కూడా తోడు కావడంతో టీవీ ప్రేక్షకులు అయోమాయనికి గురి అయ్యారు. ఈ నెల 31తో టారిఫ్ విధానం ముగిసింది.అయితే, చానళ్లు ఎంపిక చేసుకోవడంలో వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానానికి తెర లేపింది.
టీవీ వీక్షకులకు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ శుభవార్త చెప్పింది.కొత్త టారిఫ్ విధానం ప్రకారం చానళ్లు ఎంచుకునే గడువును మార్చి 31 వరకు పొడిగించింది. వినియోగదారులకు స్థానిక కేబుల్ ఆపరేటర్లు అవగాహన కల్పించడంలో విఫలం కావడం వల్లే కొత్త టారిఫ్ విధానం ప్రకటించింది ట్రాయ్.దేశవ్యాప్తంగా 10 కోట్ల కేబుల్ సర్వీసులు 6.7 కోట్ల డీటీహెచ్ సర్వీసులు ఉన్నట్లు ట్రాయ్ ఓ నివేదిక ద్వారా తెలిపింది.