Friday, May 17, 2024
- Advertisement -

మెద‌క్‌ జిల్లాలో కొత్త‌ మండ‌ల.. సీఎం కేసీఆర్ ఆమోదం!

- Advertisement -

మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. కాగా, కొత్త మండలం ఏర్పాటు చేయాలన్న నర్సాపూర్ శాసనసభ్యుడు చిలుముల మదన్ రెడ్డి వినతిని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

కొత్తగా ఏర్పడే మాసాయిపేట మండలంలో మొత్తం 9 గ్రామాలు ఉంటాయి. చేగుంట మండలంలోని 3 గ్రామాలు, యెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు కలిపి మొత్తం 9 గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -