ప్రపంచంలోని యువత ప్రస్తుతం స్పోర్ట్స్ బైక్లంటే చెప్పలేనంత ఇస్టం.అందుకు తగ్గట్లుగానే పలురకాల బైక్ కంపెనీలు అత్యాధినిక టెక్నాలజీతో యువత మనసుని ఆకట్టుకొనే స్పోర్ట్స్ బైక్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
ఇప్పుడు జర్మనీ కార్లదిగ్గజం బీఎండబ్ల్యు సరికొత్త అత్యాధునికి టెక్నాలజీతో రూపొందించి సూపర్ స్పోర్ట్స్ బైక్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యు కొత్తగా రూపొందించిన కాన్సెప్ట్ టూ వీలర్స్ త్వరలోనే రోడ్లపై హల్ చల్ చేయనున్నాయి. బీఎండబ్ల్యు మోటరాడ్ ద్వారా ద్విచక్ర వాహన రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ ‘కాన్సెప్ట్ లింక్ ’ హై ఎండ్ బైక్ను లాంచ్ చేసింది. త్వరలోనే వీటిని భారత్లో ప్రవేశపెట్టనుంది. టైటానియం, సెమి మ్యాట్ బ్లాక్ బాడీతో, ఆరెంజ్ కలర్ ఇంటీరియర్తో డిజైన్తో సెమీ ఎక్స్పోజ్డ్ ఇంటీరియర్ డ్రైవ్ యూనిట్, విత్ కూలింగ్రిబ్స్ ,టచ్ సెన్సిటివ్ జాకెట్టు ప్రధాన ఫీచర్లుగా ఇది బైక్ రైడర్స్ను ఆకట్టుకోనుంది.
{loadmodule mod_custom,Side Ad 2}
బీఎండబ్ల్యు మోటారాడ్ డిజైన్ హెడ్ అడ్గర్ హీన్రిచ్ ప్రకారం, “కాన్సెప్ట్ లింక్” బైక్ డిజిటల్ అండ్ అనలాగ్ ప్రపంచాలను అనుసంధానిస్తుంది. రైడర్ ప్రయాణ అవసరాలపై దృష్టి కేంద్రీకరిస్తూ, డిజిటైజేషన్ను అనుసంధానిస్తుంది. ఒక వాహనాంగానే కాకుండా కమ్యూనికేషన్ డివైస్ లా రైడర్కు సహకరిస్తుంది. దీంతో విండ్ షీల్డ్ మీద డిస్ ప్లే సమాచారం ద్వారా దగ్గర గమ్యాన్ని లేదా ప్రకృతి సౌందర్యంతో కూడిన రూటును ఎంచుకునే సౌలభ్యం. అలాగే ఎడ్జస్టబుల్ సీట్, సీక్రెట్ లగేజ్ కంపార్ట్మెంట్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}vXdlkHwyPh8{/youtube}
Also Read