ఆమ్ఆద్మీ పార్టీకి ఏమైంది? ఓ వైపు మ్యానిఫెస్టోలు, మరో వైపు వివాదాలు, తప్పులకు చెల్లిస్తోంది భారీ మూల్యం. ధూమపానానికి సంబంధించిన ఈ యాడ్ఆమ్ఆద్మీ పార్టీకి అతికినట్టు సరిపోతుంది. పంజాబ్ఎన్నికల్లో విజయం సాధిస్తామని ప్రతీ వేదికపైనా గొప్పలు చెప్పుకుంటున్న ఆప్ఇప్పటికీ రెండుసార్లు వివాదంలో కూరుకుపోయింది.
యూత్మ్యానిఫెస్టో పేరుతో ఆమ్ఆద్మీ పార్టీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పంజాబ్లో పాగా వేసేందుకు తహతహలాడుతున్న చీపురు పార్టీ పంజాబీల మనోభావాలను మాత్రం గుర్తిస్తున్నట్టు కనిపించడం లేదు. యూత్మ్యానిఫెస్టోలో పార్టీ గుర్తు చీపురును సిక్కులు పరమపవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం చిత్రం పక్కన ముద్రించారు. ఇది చాలా మంది సిక్కులకు ఆగ్రహం తెప్పించింది.
ఇది చాలదన్నట్టు ఆప్నేతలు అత్యుత్సాహానికి పోయి తమ మ్యానిఫెస్టోను సిక్కులు దైవంగా భావించే గురుగ్రంథ్సాహిబ్తో పోల్చి కొత్త వివాదం సృష్టించారు. తమపై ఎన్ని కుళ్లు జోకులు వేసినా సహించే సిక్కులు గురుగ్రంథ్సాహిబ్ను, స్వర్ణ దేవాలయాన్ని ఏమైనా అంటే సహించరనే చిన్న విషయాన్ని ఢిల్లీని ఏలే పెద్దలు గుర్తించకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ వివాదాల మధ్య తాజాగా ఎస్సీల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో రూపొందిస్తామని ఆమ్ఆద్మీ పార్టీ చెప్తోంది. మరీ అది ఏ వివాదం సృష్టిస్తుందో.
Also Read