మంచి రోజులు వస్తే అంతా సంతోషిస్తారు. కాని తెలంగాణ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న వారు మాత్రం మంచి రోజులనగానే టెన్షన్తో వణికిపోతున్న పరిస్థితి. తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తర్వాత మార్పులుంటాయని ప్రచారం జరిగినా మంచి రోజులు లేవని కొన్నాళ్లు, ఆషాఢమని కొన్నాళ్లు మార్పులు, చేర్పుల వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు శ్రావణ మాసం, శుభ ఘడియలు రావడంతో మంత్రులంతా భయపడుతున్నారు. తాజాగా ఎంసెట్ ప్రశ్నపత్రం లీతు మంత్రుల ఆందోళనను రెట్టింపు చేస్తోంది.
కొశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులన్నది పుష్కరాల తర్వాత ఉండే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. ఏది ఏమైనా పుష్కరాలు పూర్తయ్యేంత వరకు తెలంగాణ మంత్రులంతా సేఫే…