- Advertisement -
తెలంగాణ మంత్రుల మెడపై కత్తులు వేలాడుతుంటే ఏపీ మంత్రులు మాత్రం ప్రస్తుతానికి తాము సురక్షితమని ధీమాగా చెప్పుకుంటున్నారు. లోకేశ్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని చంద్రన్న ప్రస్తుతానికి వాయిదా వేయడంతో తమకు పదవీ గండం లేదని చాలా మంది ఏపీ మంత్రులు నమ్ముతున్నారు.
వీటికి తోడూ ఏపీలో చాలా మున్సిపల్ కార్పొరేషన్లకు అక్టోబర్/నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆ ఎన్నికల బాధ్యతలను ప్రస్తుత మంత్రులే అప్పగించి, ఆ ఫలితాల ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. మరీ ఆ ఎన్నికల పరీక్షలో మంత్రులు ఎన్ని మార్కులు స్కోర్ చేస్తారో చూడాలి.