2019 ఎన్నికలు వైసీపీకి కీలకం. ఈ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.అయితే ఈఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఆ పార్టీకి ఉన్నాయి.
దీంతో అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు, అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు కూడ ఆ పార్టీ సన్నద్దమైంది.
జగన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకొన్నారు.రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఏపీలో పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను నేరుగా కలుసుకోవాలని, అందుకు సభలు, దీక్షలు నిర్వహిస్తే సరిపోదని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు తెలిసింది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి 2014లో పాదయాత్ర చేపట్టి అధికారాన్ని చేపట్టారు.అనాడు నెలకొన్న పరిస్థితులు,పాదయాత్ర కూడా అధికారంలోకి రావడానికి దోహాదపడింది.ఇక 2014లో చంద్రబాబుకూడా చేపట్టిన పాదయాత్రలో రుణాలు మాఫీ చేస్తానని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
{loadmodule mod_custom,GA1}
జగన్ కూడా తండ్రి బాటలో ప్రశాంత్ కిషోర్ సూచన మేరకే పాదయాత్ర చేయనున్నారు.అందుకు పాదయాత్ర ఒక్కటే మంచి మార్గమని జగన్ కూడా భావించినట్లు సమాచారం. వైసీపీ ప్లీనరీలో ఈ పాదయాత్ర నిర్ణయాన్ని వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటించనున్నారు.
ఏపీలోని 13 జిల్లాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. వైఎస్ కూడా ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహించి సీఎం అయ్యారని, అదే ఫార్ములా తమ అధినేతకు కూడా కలిసొస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.మరి పాదయాత్ర ఎతంవరకు ఉపయేగపడుతుందో కాలమే నిర్నయించాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}AgZkjiIkCrM{/youtube}