Wednesday, May 15, 2024
- Advertisement -

సర్వే ఏదైనా…గెలుపు వైసీపీదే!

- Advertisement -

ఏపీలో రెండోసారి తిరుగులేని మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేల్లో జగన్‌కు మంచి ప్రజాదరణ ఉందని తేలడంతో పాటు కూటమికి భంగపాటు తప్పదని తేలింది. ఇక టీడీపీ నేతల సర్వేలోనూ వైసీపీదే విజయం అని ఆ పార్టీ నేతలు మాట్లాడుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఆంధ్రా లైవ్ న్యూస్ నిర్వహించిన సర్వేలో జగన్ రెండోసారి సీఎం కావడం ఖాయమని తేలింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 550 మంది అభిప్రాయాలను సేకరించగా ఇందులో మెజార్టీ సభ్యులు జగన్‌కే జై కొట్టారు.

జగన్‌కు 51 శాతం మద్దతు పలకగా కూటమికి 41 శాతం, ఇండియా కూటమికి 4 శాతం, ఇతరులకు నాలుగు శాతం మద్దతు పలికారు. సీట్ల పరంగా చూస్తే వైసీపీకి 149 స్థానాలు రానుండా టీడీపీ కూటమి 26 స్థానాలకే పరిమితమవుతుందని తేలింది. 79కి పైగా స్థానాల్లో వైసీపీ 10 వేల మెజార్టీతో గెలుస్తుందని,57కి పైగా స్థానాల్లో 5 నుండి 10 వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని తేలగా 13 స్థానాల్లో 5 వేల లోపు మెజార్టీ వస్తుందని అంచనా వేసింది. ఇక సర్వేల రిపోర్టు వైసీపీ శ్రేణుల్లో జోష్‌ని నింపుతోండగా ప్రతిపక్ష పార్టీల్లో నిరాశ వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -