- Advertisement -
వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ తర్వాత దూకుడు పెంచారు ఏపీ సీఎం జగన్. ఇప్పటికే తొలి విడత బస్సు యాత్రలో మెజార్టీ స్థానాలను చుట్టేయగా ఇప్పుడు రెండో విడత బస్సు యాత్ర మేమంతా సిద్ధం ఖరారైంది.
నేటి నుండి అంటే 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు,29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండపి, మైదుకూరు, పీలేరు,మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ ఖరారు చేశారు. ప్రతి రోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు వెల్లడించాయి. ఇక ఫస్ట్ ఫేజ్ బస్సు యాత్ర 22 పాటు జరిగిన సంగతి తెలిసిందే. జగన్పై రాయి దాడి నేపథ్యంలో ఒక రోజు వైద్యుల సూచన మేరకు విరామం తీసుకున్నారు.