హారతి సమయంలో ఈ గుళ్లో దేవుడు కళ్లు తెరుస్తాడని తెలుసా?

అవును… మీరు విన్నది నిజమే. హారతి ఇచ్చే సమయంలో కర్పూర కాంతిలో స్వామివారు కళ్లు తెరిచినట్టుగా కనిపిస్తుంది. తమిళనాడులోని కోయంబేడ్ లో ఈ అరుదైన ఆలయం ఉంది. కోయంబేడ్ కి కిలీమీటరున్నర దూరంలో శ్రీకరి వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉంది.

మామూలు సమయాల్లో సాధారణంగానే ఉండే  మూర్తి హారతి సమయంలో మాత్రం కళ్లు తెరిచినట్లు దర్శనమిస్తుంది. హారతి ఎటు తిరిగితే అటు వైపు మూర్తి కూడా కళ్లు తిప్పుతున్నట్లుగా ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ వింతని చూడడానికి ఎక్కడెక్కనుండో భక్తులు వస్తుంటారని అంటున్నారు.