కొత్తగా హోటల్స్ లేదా షాపింగ్ మాల్స్ ప్రారంభించే వాళ్లు కస్టమర్లు ఆకట్టుకొనేందుకు చిత్ర విచిత్ర ఆఫర్లు ప్రకటిస్తుంటారు. తద్వారా తమ హోటల్కు ఫ్రీ పబ్లిసిటీ పొందుతుంటారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లోనూ రూ. 1 కే చీర అమ్మకాలు, వివిధ ఉచిత ఆఫర్లు ప్రకటించిన వ్యాపర సంస్థలు ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్ లో సుకన బిర్యానీ హోటల్ ఓ వింత ఆఫర్ ను తెరమీదకు తీసుకొచ్చింది. రూ. 5 పైసలకే బిర్యానీ పెడతామంటూ ప్రకటించింది.
ఎవరైతే 5 పైసల నాణెం తీసుకొస్తారో.. వాళ్లకు బిర్యానీ పెడతామని చెప్పింది. నిజానికి ప్రస్తుతం 5 పైసల నాణేలు దొరకడం కష్టం కాబట్టి.. పెద్దగా స్పందన రాకపోవచ్చని హోటల్ యాజమాన్యం భావించింది. కానీ అనూహ్యంగా 5 పైసలు నాణేలు తీసుకొని కస్టమర్లు ఎగబడ్డారు. హోటల్ ముందు క్యూ కట్టారు. కరోనా నిబంధనలు పాటించకుండా బారులు తీరారు. దీంతో హోటల్ యాజమాన్యం తల పట్టుకున్నది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రూ. 5 పైసలకు బిర్యానీ అనగానే జనం ఈ రేంజ్లో ఎగబడతారని తాము ఊహించలేకపోయాని హోటల్ యజమాని అంటున్నారు. ప్రస్తుతం ఐదు పైసల నాణేలు దొరకడం కష్టం కాబట్టి.. జనాలు వాటిని సేకరించుకోవడం ఇబ్బంది అవుతుందని భావించామని.. అయితే హోటల్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుందని అనుకున్నామని ఆయన చెప్పారు. కానీ అనూహ్యంగా కస్టమర్లు హోటల్ ముందు బారులు తీరారని చెప్పారు. చివరికి జనం రద్దీ పెరగడంతో నిర్వాహకులు హోటల్ మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read
రైతన్న కడుపుకొట్టిన ఎలుకలు..! నోట్ల కట్టలు కొరికేశాయి..!
చిరుత వర్సెస్ కుందేలు.. మధ్యలో అడవిపంది.. ఈ సీన్ మామూలుగా లేదు..!