బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కంగనా రనౌత్. అటు తన సినిమాలతో పాటు, ఇటు వరుస వివాదాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకుంది ఈ భామ. కెరీర్ స్టార్టింగ్లో అందరి హీరోయిన్ల మాదిరిగానే చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. 2006లో వచ్చిన ‘గ్యాంగ్స్టర్’ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. . ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుని ఫుల్ పాపులర్ అయిపోయింది.
వివాదాల్లో కూడా ఈ అమ్మడు ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటోంది. ఇక ఎఫైర్స్ నడపడంలో కూడా కంగనా దిట్ట అనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. హృతిక్కు పెళ్లి అయిందని తెలిసినప్పటికి మనోడితో ఎఫైర్ నడిపింది. కంగనాతో ప్రేమలో ఉన్న హృతిక్ తన భార్యకు విడాకులిచ్చాడు. కాని తరువాత హృతిక్, కంగనాల మధ్య విభేదాలు రావడంతో..అతనికి బ్రేకప్ చెప్పేసింది.
ఇదిలా ఉంటే తాజాగా కంగనా పర్సనల్ విషయంపై బాలీవుడ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశాడు. ‘2014లో హృతిక్ రోషన్తో డేటింగ్లో ఉన్న సమయంలో కంగనా రనౌత్కు అబార్షన్ చేయించుకుంది’ అంటూ పేర్కొన్నాడు.’అబార్షన్ చేయించుకున్న తర్వాత కంగనా పిచ్చిదానిలా, సైకోలా మారిపోయింది. ఈ కారణంగానే ఆమె ఏం మాట్లాడుతున్నారో తెలియకుండానే మాట్లాడుతున్నారని ఉమైర్ సంధు తెలిపారు. ఆ తర్వాత ఎంతో మంది సైక్రియార్టిస్టులను కలిసి ఎన్నో థెరఫీలను కూడా చేయించుకుంది’ అంటూ అందులో చెప్పుకొచ్చాడు. మరి తన అబార్షన్ గురించి వచ్చిన వార్తలపై కంగనా రనౌత్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.