టీడీపీ సర్కార్కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది టీడీపీ ప్రభుత్వం. అయితే అక్కడ కూటమి సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది.
అక్రమ మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అక్రమ మైనింగ్ పై సమగ్ర దర్యాప్తు ఇవ్వాలని, విచారణకు ఈనెల 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అలాగే గన్నవరం ప్రైవేట్ స్థల వివాదంలో వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది.
సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా ఎలా మారుస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్కు కొట్టేసింది. ఇప్పటికే హైకోర్టులో వంశీపై ఉన్న అన్నీ కేసుల్లో బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ వంశీ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.
