- Advertisement -

వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి

- Advertisement -

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ వైషమ్యాలు మరోసారి భగ్గుమన్నాయి. పట్టణంలోని 2వ వార్డులో నిన్న రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ (TDP) కి చెందిన కొందరు వ్యక్తులు కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే రాజకీయ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారనే కక్షతోనే టీడీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చిన వైసీపీ కార్యకర్తలు తమ్మిశెట్టి మంగమ్మ, తమ్మిశెట్టి శ్రీహరిలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు ఒక్కసారిగా దాడికి దిగారు. తీవ్రమైన గాయాలవడంతో బాధితులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

దాడి జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, తోటి వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన మంగమ్మ, శ్రీహరిలను వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, గాయాలు బలంగా తగలడంతో పరిస్థితి విషమించింది. దీనితో మెరుగైన వైద్యం అందించడం కోసం వైద్యుల సూచన మేరకు బాధితులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర చికిత్స అందుతోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ కారణాలతో మహిళలపై, కార్యకర్తలపై ఇలాంటి దాడులకు తెగబడటం పట్ల వైసీపీ స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -