Sunday, May 19, 2024
- Advertisement -

ప్ర‌ముఖ హాస్య న‌టుడు క‌న్నుమూత‌

- Advertisement -

త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు కోవై సెంథిల్(74) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోవై సెంథిల్ కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.హాస్యనటుడిగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆయన రాణించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ న‌టించిన నరసింహాతో పాటు ఇదునమ్మ ఆళు, గోవా తదితర చిత్రాల్లో ఆయన నటించారు.

కోవై సెంథిల్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సెంథిల్ అసలు పేరు కుమారస్వామి. కోవై సమీపంలోని వడవల్లి ఆయన స్వస్థలం. అనారోగ్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సెంథిల్ మృతిపై నడిగర్‌ సంఘం సంతాపం వ్యక్తం చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -