Saturday, April 20, 2024
- Advertisement -

కృష్ణంరాజు మరణానికి కారణం అదే.. ఆ ఒక్క కోరిక తీరకుండానే మృతి !

- Advertisement -

తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబస్ స్టార్ గా చెరిగిపోని ముద్ర వేసిన. కృష్ణంరాజు ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు యావత్ తెలుగు ప్రజలు దిగ్బ్రంతికి గురయ్యారు. 1940 జనవరి 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వారు.

కృష్ణంరాజు మొదట చదువు పూర్తి అయిన తరువాత జర్నలిస్ట్ గా కూడా పని చేశారు. కానీ సినిమాలపై ఉండే మక్కువతో 1966 లో చిలక గోరింక చిత్రంతో సినీ ఆరంగేట్రం చేశారు. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కృష్ణంరాజు తెలుగు చలనచిత్రాల్లో చెరిగిపోని ముద్ర వేశారు. 183 సినిమాలకు పైగా నటించిన ఆయనకు భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, మన వీరు పాండవులు వంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక రాజకీయాల్లో కూడా ఎంపీ గానూ, కేంద్ర మంత్రిగాను కృష్ణంరాజు రాణించారు. ఈ మద్య కాలంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ లో కూడా కృష్ణంరాజు ప్రత్యేక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

కృష్ణంరాజు వయసు సుమారు 83 సంవత్సరాలకు పైబడి ఉండడంతో వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన.. ప్రధానంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో మృతి పొందినట్లు తెలుస్తోంది. అయితే కృష్ణంరాజు బ్రతికి ఉన్న రోజులలో తన తమ్ముడి కొడుకు అయిన ప్రభాస్ పెళ్లి చూడాలని ఉందంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అమ్మాయిని చూస్తున్నామని, త్వరలోనే ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన వార్త చెబుతామంటూ కృష్ణంరాజు మీడియా సమావేశాల్లో తరచూ చెబుతుండేవారు. అయితే ప్రభాస్ పెళ్లి చూడాలనే కోరిక తిరకుండానే కృష్ణంరాజు మృతి చెందడంతో ఆయన అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

కృష్ణంరాజుగారు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ… ఓం శాంతి 🙏 #RIP #KrishnamRaju #RIPKrishnamRajuGaru

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -