తెలుగు ప్రజలకు జబర్ధస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తెలుగు బుల్లితెరపై ఎన్నో కామెడీ ప్రోగ్రామ్స్ వచ్చినా.. జబర్ధస్త్ మాత్రం ఓ ప్రత్యేకత చాటుకుంటూ వస్తుంది. 2013 ఫిబ్రవరిలో మొదలైన జబర్దస్త్ కామెడీ షో 25 ఎపిసోడ్స్ అని ప్లాన్ చేసుకుంటే ఏకంగా 400 ఎపిసోడ్స్ వరకు వచ్చింది. దాన్నిబట్టే షో ఎంత పెద్ద సక్సెస్ అనేది అర్థమవుతుంది. నాగబాబు, రోజా జడ్జులుగా మొదలైన ఈ షో నుంచి గతేడాది మెగా బ్రదర్ తప్పుకున్నాడు. ఆయన స్థానంలో సింగర్ మనో వచ్చాడు. ఒక్కరు ఇద్దరు కాదు ఈ షో నుంచి చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి కూడా వచ్చారు. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక జబర్దస్త్ 400వ స్పెషల్ ఎపిసోడ్లో ఎన్నో ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. జడ్జీ అయిన రోజాతో సహా అందరూ కమెడియన్స్ యాంకర్ అనసూయ ఎంతో ఏమోషన్ అయ్యారు. ఈ 400 ఎపిసోడ్స్ ప్రయాణంలో తమ పాత్రలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వెంకీ అయితే కన్నీరు మున్నీరయ్యాడు.
గతంలో తమ బంధువులు చులకనగా చూసే వాళ్లని కానీ ఇప్పుడు వెంకీ మా వాడే అని చెప్పుకుంటున్నారంటే దానికి కారణం జబర్దస్త్ అని ఏడ్చేసాడు. తాను నాలుగేళ్ల కింద 100 రూపాయలు కావాలంటే పక్కింటి వాళ్లను అప్పు అడిగే స్టేజ్ నుంచి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అభి అన్నా.. జబర్దస్త్ కామెడీ షో అంటూ కన్నీరు పెట్టుకున్నాడు హైపర్ ఆది. 400 ఎపిసోడ్స్లో ఒక్కటి కూడా మిస్ కాకుండా చేసిన రాకెట్ రాఘవకు సన్మానం కూడా చేసారు.