తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ఎంతగా ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏడేళ్లకు పైగా ఈ కామెడీ షో ఎక్కడ ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ప్రతి నిత్యం కొత్త కొత్త స్కిట్స్ తో అలరిస్తున్నారు కమెడియన్లు. జబర్ధస్త్ తో పాపులర్ అయిన కొంత మంది కమెడియన్లు ఇండస్ట్రీలో కూడా తమ సత్తా కొనసాగిస్తున్నారు. అయితే జబర్ధస్త్ లో కొన్ని స్కిట్స్ పై పలుమార్లు అభ్యంతరాలు వెల్లువడుతున్నాయి.
గతంలో కొంతమంది జబర్ధస్త్ కమెడియన్స్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న (ఆదివారం) ఈ టీవీలో ప్రసారం అయిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆది, స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్పై ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఆదిపై మానవహక్కుల సంఘానికి (హెచ్ఆర్సీ) ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్త మహేష్లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కేసీఆర్ సారు.. రైతులు చావే దిక్కంటున్నారు : వైఎస్ షర్మిల
బీజేపీకి సీన్ రివర్స్.. పార్టీ నుంచి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు ?