Wednesday, May 8, 2024
- Advertisement -

సూరత్ దారుణం పై మోదీ కన్నీటి పర్యంతం..2 లక్షలు పరిహారం..!

- Advertisement -

గుజరాత్​లోని సూరత్​లో మంగళవారం జరిగిన ట్రక్కు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్​ఆర్​ఎఫ్​) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు. సూరత్​లోని కోసంబ ప్రాంతంలో నిద్రిస్తున్న కూలీలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో 15 మంది మృతిచెందారు.గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -