తమిళనాడు మాజీ సీఎం జయలలిత గురించి మనం ఇప్పడు ప్రత్యేకంగా మాట్లాడుకొవాల్సిన అవసరం లేదు. ఆమె రాజకీయ ప్రస్థానం ఒక సంచలనం.తమిళ జనాలతో అమ్మ అని పిలిపించుకున్న జయలలిత వాళ్ల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు.ఆమె మరణించి సంవత్సరం దాటిన కూడా తమిళ రాజకీయలలో ఆమె పేరు ఏదోవిధాంగా వస్తునే ఉంది.అసలు ఆమె మరణం తరువాత తమిళ రాజకీయ శున్యత ఏర్పడింది.తమిళ రాజకీయలలో కేంద్రం ఎక్కువ కలుగజేసుకుంటుంది అనే వాదన ఉంది.కమల్,రజిని లాంటి సినిమా స్టార్స్ జయలలిత మరణం తరువాతే రాజకీయలలోకి వస్తాము అని ప్రకటించారు.ఇప్పుడు తాజాగా జయలలిత బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలు ఉన్నాయి.అయితే ఇది జయలలిత జీవిత కథాంశగా తెరక్కెకుతున్న సినిమా కాదు.
తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో జయలలిత పాత్ర కొంచెం ఉంటుందని సమాచారం. జయలలిత రోల్ కోసం కాజల్ ను అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది.మరి ఈ ఆఫర్ని కాజల్ ఓకే చేస్తుందో లేదో చూడాలి.మరోవైపు శ్రీదేవి పాత్ర కోసం బాలీవుడ్ టాప్ స్టార్ దీపికా పదుకొనేను ప్రయత్నిస్తున్నారు ఎన్టీఆర్ మూవీ యూనిట్. ఈ పాత్రలు అన్ని సినిమాలో కొంచెం సేపు మాత్రమే ఉంటాయి అని సమాచారం. కాని వీరి రేమ్యునిరేషన్ మాత్రం ఎక్కువుగానే ఉండనుంది.అయిన బాలయ్య సినిమాను చాలా రిచ్గా తీయడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తుంది.