టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన రచ్చ అంత ఇంత కాదు.టాలీవుడ్ మొత్తాన్ని ఇందులో భాగస్వామ్యం చేసింది శ్రీరెడ్డి.ఆధారాలు లేని ఆరోపణలు చేసి తీవ్ర విమర్శల పాలైంది.దీంతో టాలీవుడ్లో ఆమెను పట్టించుకోవడం లేదు.చేసేది లేక గత కొంత కాలంగా తన ఫేస్బుక్లో పోస్ట్లు పెడుతు కాలం గడుపుతుంది.తాజాగా శ్రీరెడ్డి తమిళ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని విమర్శల చేయడం మొదలు పెట్టింది.
దర్శకుడు మురుగదాస్, సుందర్, నటుడు శ్రీరామ్, లారెన్స్ తదితరులు అవకాశాలు ఇస్తామంటూ ఆశ చూపి, తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆమెపై విరుచుకుపడ్డారు.శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని అయినప్పటికీ, వాటితో ప్రచారం పొందాలని ఆమె అనుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇలా చేయాలా అని ఆయన శ్రీరెడ్డిని ప్రశ్నించారు.