#మీటూ ఉద్యమం ద్వారా ఇండస్ట్రీలో జరిగిన లైంగిక వేధింపులు మొత్తం బయటికి వస్తున్నాయి.ఇప్పటి వరకు మహిళలపై మగవారు చేసిన అకృత్యాలు బయటికి వస్తున్నాయి.అయితే తాజాగా మరో విచిత్ర సంఘటన బయటికి వచ్చింది.ఓ మహిళ,మరో మహిళపై లైంగిక దాడి చేయడం సంచలనంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే….మాయా కృష్ణన్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకి పాల్పడినట్లు అనన్య రామ్ ప్రసాద్ ఆరోపించారు. ”నటి మాయ కృష్ణన్ నా జీవితాన్ని సర్వ నాశనం చేసింది. ఆమె కారణంగా నా కుటుంబానికి, స్నేహితులకి దూరమయ్యాను. ఆమె వలన లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతో మానసికంగా కృంగిపోయాను.
నన్ను వేధించింది ఒక మగాడు అయి ఉంటే ఈ విషయం చెప్పడానికి ఇంతగా ఇబ్బంది పడేదాన్ని కాదు. కానీ ఓ మహిళ కారణంగా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. 2016 లో నాకు మాయ కృష్ణన్ తో పరిచయం ఏర్పడింది. నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెకి 25.. ఆ సమయంలో నన్ను లొంగదీసుకొని నాతో శారీరక సంబంధం పెట్టుకుందని చెప్పుకొచ్చింది.
