- Advertisement -
రామ్చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా కైరా అద్వానీ నటిస్తుంది. షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా షెడ్యూల్ పూర్తైనట్లు చిత్ర బృందం పేర్కొంది.తదుపరి షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లుతుంది చిత్ర యూనిట్. అక్కడ 15 రోజులపాటు షూటింగ్ జరుగుతుంది.
ఫ్యామిలీ ఎమోషన్స్తోపాటు పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందిస్తున్నాడు బోయపాటి.మెగా అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించేలా రామచరణ్ను సరికొత్తగా చూపించబోతున్నాం అని చిత్ర నిర్మాత డివివి దానయ్య తెలిపారు. సినిమాను దసరాకు రీలిజ్ చేయలని చిత్ర యూనిట్ భావిస్తుంది.