- Advertisement -
శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఓ IAS ఆఫీసర్ కి, అవినీతి రాజకీయనాయకులకు మధ్య జరిగే కథే గేమ్ ఛేంజర్.
రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా త్వరలోనే రిలీజ్ ఉంటుందని అంతా భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మరో నెల ఆలస్యంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ తో పాటు పుష్ప 2, దేవర, కల్కి 2898 ఏడి మూవీస్ యొక్క నార్త్ రైట్స్ ని అనిల్ తడానీ దక్కించుకున్నారు. వరుసగా పెద్ద సినిమాల రిలీజ్ ఉన్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్ వెనక్కి జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ అఫిషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది.