- Advertisement -
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ భారీ బడ్జెట్ సినిమాను దిల్ రాజు తెరకెక్కిస్తుండగా రిలీజ్ కోసం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్పై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. ఇప్పటికే సినిమా చాలా లేట్ అయిందని, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
ఈ సినిమాని చాలా లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. పూణే, వైజాగ్, రాజమండ్రి, కర్నూల్, చెన్నై, హైదరాబాద్ చాలా ప్రదేశాల్లో షూట్ జరుగగా ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కీలక పాత్రలను తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. పాలిటిక్స్, నిజాయితీ గల ఆఫీసర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.