బాలీవుడ్లో హీరోయిన్ శ్రద్ధాకపూర్ లీడ్ రోల్లో నటించిన స్త్రీ మూవీ గత శక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.రాజ్ కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా అమర్ కౌశిక్ తెరకెక్కించిన హర్రర్ చిత్రం ‘స్త్రీ’ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. విడుదల రోజు నుంచే ఈ సినిమా తన సత్తా చాటుతుంది. కొన్నాళ్ల క్రితం రాత్రిపూట ఓ ఆడ దెయ్యం సంచరిస్తూ ప్రజలను చంపేస్తుందని వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే దెయ్యం ఇంట్లోకి రాకుండా ఉండేందుకు చాలామంది ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ తమ ఇళ్లపై రాసుకున్నారు. ఈ ఘటన ఆధారంగానే స్త్రీ చిత్రాన్ని అమర్ కౌశిక్ తెరకెక్కించారు.
సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మూడు రోజుల్లో రూ.31.26 కోట్ల కలెక్షన్ వసూలు చేసి చరిత్ర సృష్టించిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. . విడుదలైన శుక్రవారం రూ.6.82 కోట్లు, శనివారం రూ.10.87 కోట్లు, ఆదివారం రూ.13.57 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు. శ్రద్ధాకపూర్ నటన అందరిని ఆకట్టుకుందని చెబుతున్నారు.ఇక సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.