Monday, May 20, 2024
- Advertisement -

అనుపమ..రేటు పెంచేసింది!

- Advertisement -

అనుపమ పరమేశ్వరన్‌..టిల్లు స్క్వేర్‌తో సక్సెస్ బాట పట్టింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కుర్ర హీరోలతో ఆఫర్లు వస్తుండగా వెంటనే ఓకే చెబుతున్నారు అనుపమ. ఇక ఈ సినిమా తర్వాత తన రెమ్యునరేషన్‌ని అమాంతం పెంచేసిందట అనుపమ.

టిల్లు స్వ్కేర్‌కు ముందు ఒక్కో సినిమాకు కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న అనుపమ ప్రస్తుతం రెండు కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని సమాచారం. అనుపమ రెమ్యునరేషన్ పెంచినా నిర్మాతలు ఎస్ అనే అంటున్నారని తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ అక్టోపస్‌ చేస్తుండగా ఇందులో అనుపమ లీడ్ రోల్ పోషిస్తున్నారు. అలాగే బైసన్, లాక్ డౌన్ అనే మరో రెండు ప్రాజెక్టులు కూడా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తమిళ మూవీ బైసన్. ఇదో స్పోర్ట్స్ డ్రామా చిత్రం. లాక్ డౌన్ మూవీకి ఏఆర్ జీవా దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటే అనుపమ పెట్ డిటెక్టివ్ అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -