అనుపమ పరమేశ్వరన్.. మలయాళం అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే తెలుగుదనం ఆమె సొంతం. అందం, తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనుపమ ఆసక్తికర పోస్ట్ చేసింది.
ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన ఏజ్లో ఉన్న వాళ్లలో కొందరు పెళ్లి చేసుకుంటున్నారు… ఇంకొందరికి కడుపులు అవుతున్నాయి.. కానీ తాను మాత్రం బయటకు వెళ్లాలంటే ఇంకా పర్మిషన్ తీసుకునే పరిస్థితే ఉందని నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. అంతే అనుపమ పోస్ట్ని క్షణాల్లో ట్రెండింగ్ చేసేశారు ఫ్యాన్స్.
గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో నటించి మెప్పించింది అనుపమ. ప్రస్తుతం డీజే టిల్లు స్వ్కేర్ సినిమా చేస్తోంది. డీజే టిల్లూకు సీక్వెల్గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే కూడా డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని తెలుస్తోంది. ఈ సీక్వెల్కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.