తన కెరీర్లో తొలిసారి బోల్డ్ పాత్రలో నటించింది నటి అనుపమ పరమేశ్వరన్. డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్తో ప్రేక్షకుల ముందుకు రానుండగా సిద్దూ జొన్నలగడ్డతో హద్దులు దాటి రొమాన్స్ చేసింది అనుపమ. దీని గురించే కొంతమంది అడగ్గా అంతే బోల్డ్గా సమాధానం చెప్పింది.
కథ నచ్చింది అందుకే లిల్లీ పాత్రను వదులుకోవద్దనుకున్నానని తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం ప్రారంభించా..అన్ని చిత్రాల్లో ఒకేలాంటి పాత్రలో నటించడం బోర్గా ఫీలయ్యా..అందుకే పెర్ఫామెన్స్కు స్కోప్ ఉన్న లిల్లీ పాత్రకు ఒకే చెప్పానని తెలిపింది.
టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈ ముద్దుగుమ్మ పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది. అయితే టిల్లు స్క్వేర్లో సిద్దూతో రొమాన్స్ ఒకవైపు అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో అనుపమ చేస్తున్న బోల్డ్ కామెంట్స్ వైరల్గా మారాయి. ఈ నెల 29న సినిమా రిలీజ్ కానుంది.