- Advertisement -
రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు వారాల క్రితమే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల31 వ తేది వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 3 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 11 ఎన్నికలు జరుగుతాయి.
అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు. దేశంలో మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 మంది రాజ్యసభ సభ్యులు పదవి నుంచి తప్పుకోనున్నారు. వీరిలో ఎపి నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఇక అధికార బిజెపి నుంచి ఏడుగురు కేంద్ర మంత్రులు, ఏడుగురు సభ్యులు కూడా పదవి నుంచి వైదొలుగుతారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 11 మంది సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఉత్తరాఖండ్ నుంచి ఒక సభ్యుడు రిటైర్ అవుతారు.