రాజ్యసభ అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. త్వరలో 9 రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందుకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ను ఎంపిక చేసింది.
ప్రస్తుతం వీరు అవే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. త్వరలో వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరగనున్నాయి. అలాగే మధ్యప్రదేశ్ నుంచి సుశ్రి కవితా పటిదార్, కర్ణాటక నుంచి జగ్గేష్, మహారాష్ట్ర నుంచి అనిల్ సుఖ్దేవ్రావ్ బొండే, రాజస్థాన్ నుంచి ఘన్శ్యామ్ తివారీ, ఉత్తర్ప్రదేశ్ నుంచి లక్ష్మీకాంత్ వాజ్పేయీ, రాధామోహన్ అగర్వాల్, సురేంద్రసింగ్ నగర్, బాబురామ్ నిషద్, దర్శన సింగ్, సంగీత యాదవ్కు అవకాశం కల్పించింది.
ఉత్తరాఖండ్ నుంచి , కల్పనా సైనా, బిహార్ నుంచి సతీష్ చంద్రదూబే, హరియాణా నుంచి కిషన్ లాల్ పన్వార్ను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది.
బాలకృష్ణపై రోజా సంచలన వ్యాఖ్యలు