Saturday, May 18, 2024
- Advertisement -

మగవాడి వేషంతో ముగ్గురిని పెళ్లాడిన యువతి

- Advertisement -

ఒక యువతి మగ వేషం వేసింది. అంతటితో ఊరుకోలేదు. ఒక యువతిని పెళ్లాడింది. ఆపై మరో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుంది. అయితే, మూడు పెళ్లిళ్ల తరువాత శోభనం కాకుండానే ఉద్యోగానికి వెళుతుండండంతో ఆమె గుట్టు బయటపడలేదు. చివరకు అసలు విషయం బయటపడింది.

జిల్లా లోని కాశి నయన మండలంలోని ఇటికలపాడు గ్రామానికి చెందిన రమాదేవి తమిళనాడు రాష్ట్రంలోని రోహిణి మిల్ లో ఉద్యోగం చేస్తు జీవనం కొనసాగిస్తోంది. ఏమయిదో కానీ ఆమె మగాడిలా తయారయింది. తన వేషధారణ అంతా మగాడిల వుండేలా చూసుకొంది. ఒకరితరువాత ఒకరని మొత్తం ముగ్గరమ్మాయిలను వివాహం చేసుకుంది . మొదటగా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన బుజ్జి(16) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నది. రెండవసారి అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలం లోని కోత్త చెరువు గ్రామానికి చెందిన వందన (17) అనే అమ్మాయిని వివాహం ఆడింది. ముచ్చటగా మూడవసారి మూడు నెలల క్రితం జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన నిర్మల(17)ను వివాహం చేసుకుంది . ప్రతిసారి వివాహం అయిన వెంటనే నాకు సెలవులు లేవు. త్వరలో సంసారం అక్కడే పెడతాను అని వెళ్లడం పరిపాటి. ఆ తరువాత పత్తా లేకుండా ఇంకొకరిని వివాహం అడటం రమాదేవి అలవాటు. మూడో వధువు నిర్మల పెళ్ళి అయిన కొన్నిరోజులకు రమాదేవి మోసాన్ని పసిగట్టింది. పక్కా ప్లాన్ తో రమాదేవిని పట్టుకొంది. విషయం జమ్మలమడుగు పోలీసుస్టేషన్ చేరింది. పోలీసులు విచారణ చేయడంతో రమాదేవి మగవాడి వేషం లో చేసుకున్న పెళ్ళిళ్ళగురించి బయటపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -