ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో మన దేశం ముందు వరుసలో దూసుకుపోతుంది. అన్నీ రంగాల్లోనూ మనదేశం మేటి దేశాలకు గట్టిపోటీగా నిలుస్తోంది. దాంతో మనదేశం ఆర్థిక వృద్ది రేటు కూడా గణనీయంగా ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో మనదేశం 5వ స్థానానికి చేసుకుంది.
గత కొంతకాలంగా ఐదవ స్థానంలో స్థిరంగా కొనసాగుతున్న బ్రిటన్ న్ను వెనక్కి నెట్టి మనదేశం 5వ స్థానానికి చేరుకోవడం నిజంగా గర్వకారణమనే చెప్పాలి. ఎందుకంటే 200 సంవత్సరాలు మనదేశాన్ని నిరంకుశంగా దోచుకున్న ఆ బ్రిటిష్ వారి దేశాన్ని అధిగమించి నేడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ప్రతి భారతీయుడు సంతోషంచాల్సిన విషయమే. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తరువాతి స్థానంలో చైనా, జపాన్, జర్మనీ, కొనసాగుతున్నాయి.
ఇక మొన్నటి వరకు బ్రిటన్ అయిదవ స్థానంలో కొనసాగుతూ వచ్చింది. అయితే ఆ దేశంలో కరోనా కారణంగా చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడడం, ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు.. ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభం కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే ప్రభావం చూపాయి. దీంతో ఆర్టిక వ్యవస్థ పరంగా బ్రిటన్ 5వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోయినట్లు ఐ ఏం ఎఫ్, బ్లూమ్ బర్గ్ వంటి సంస్థల సర్వేలలో వెల్లడైంది.. ఆ సర్వేలు చెబుతున్నా దాని ప్రకారం భారతదేశ జిడిపి వృద్ది రేటు మెగుగ్గ ఉందని, బ్రిటన్ తో పోలిస్తే మనదేశ జిడిపి 7 శాతం మెగుగ్గ ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం తొలి త్రైమాసికంలోనే అంచనా పరంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లుగా ఉంటే.. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆయా సంస్థలు చెబుతున్నాయి. దీంతో భారత్ ఆర్థిక వ్యవస్థ పరంగా 5వ స్థానానికి చేరుకొని బ్రిటన్ 6వ స్థానానికి పడిపోయింది.
Also Read : బ్రిటన్ ఎలక్షన్స్ : రిషి సునక్ ఓటమికి ప్రధాన కారణం అదే !