సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు సూపర్ స్టార్ మహేష్. ఎన్నో ఏళ్ల తరువాత మహేష్ కి మంచి మాస్ హిట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ చాలా జాగ్రత్తలతో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు.
ఇటీవల దుబాయిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మహేష్ కాల్షీట్లు ఎన్ని ఇచ్చారు, అసలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు వంటి వివరాలైతే బయటకు రాలేదు. కానీ హైదరాబాద్, లండన్లో కొన్ని రోజుల చిత్రీకరణ ఉంటుందని మాత్రం తెలుస్తోంది. అయితే ఇది ఇంకా ఫిబ్రవరి కావడంతో, సినిమాను త్వరగా పూర్తి చేసుకొని దసరా సందర్భంగా తీసుకొస్తారేమో అని అభిమానులు ఆశించారు.
అంతేకాదు నిర్మాతలు కూడా అదే అనుకున్నారట. సినిమా విడుదల విషయంలో నిర్మాతల మాట ఒకటైతే, మహేష్ ఆలోచన ఒకలా ఉండిందట. దీంతో మైత్రి వాళ్లు చెప్పిన ఆలోచన అయిన దసరాకు కాకుండా, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారట.
సంక్రాంతి అయితే బాగుంటుందని, సెంటిమెంట్గా తనకు సంక్రాంతి సీజన్ కలిసి వస్తోందని మహేష్ అనుకున్నారట. దీంతో నిర్మాతలు సంక్రాంతికి ఓటేశారు. అయితే సరైన తేదీ ఇంకా వెల్లడించలేదు. విడుదల తేదీ తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే…
అంతా నీ హయాంలోనే జరిగింది.. ఇప్పుడు పేలుతున్నావ్.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్!