- Advertisement -
తమిళనాడు సీఎం జయలలిత అక్రమాస్తుల కేసు ఆప్పీల్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. జయ కేసుపై ఫిబ్రవరి 2వ తేదీన విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో ఆమెపై అక్రమాస్తుల కేసును కర్నాటక హైకోర్టు కొట్టివేసింది.
ఆ తీర్పును కర్నాటక ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. జయలలితను ట్రయల్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే జయ అక్రమాస్తులు 10 శాతం లోపే ఉన్నాయంటూ కర్నాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.