మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి దయాకర్రావు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని దుబ్బాక బిజెపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఎద్దేవా చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పాలకుర్తి నియోజకవర్గానికి కనీసం డిగ్రీ కళాశాల కూడా తీసుకు రాలేదని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
సమావేశంలో మంత్రి ఎర్రబెల్లిపై రఘునందన్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మద్య విమర్శల వెల్లువలు రేకెత్తుతున్నాయి.
సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో పాలకుర్తిని పోల్చుకొని మంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలని రఘునందన్ హితవు పలికారు. టి.ఆర్.ఎస్ పాలనలో ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా పెట్టని సీఎం కేసీఆర్కు ఓటు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దగాని సోమయ్య, బిజేపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఝార్ఖండ్ లో దారుణం.. యువతిపై నెల రోజులుగా 60 మంది అత్యాచారం!