దేశంలో ఈ మద్య ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా మాకేం సిగ్గు అంటూ కామాంధులు ఎక్కడ పడితే అక్కడ రెచ్చి పోతున్నారు. మద్యం సేవించి కొంత మంది.. అశ్లీల చిత్రాలు చూస్తూ మరికొంత మంది ఆడవారు కనిపిస్తే చాలు చిత్త కార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు. దారుణమైన విషయం ఏంటంటే ఈ మద్య సామూహిక అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి.
తాజాగా ఝార్ఖండ్లో దారుణం జరిగింది. ఓ యువతిని బంధించిన దుండగులు నెలరోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బహిర్భూమి కోసం వెళ్తున్నట్టు చెప్పిన ఆమె వారి నుంచి తప్పించుకుంది. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది.
సరాయ్కేలా-ఖర్సావా జిల్లాలోని కందర్బేరా సమీపంలో మూతపడిన గ్యారేజీలో తనను నెల రోజులపాటు బంధించారని, 60 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి తెలిపింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఉందని.. తాను ఎక్కువ వివరాలు ఇవ్వలేకపోతుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
బూమ్రా పెళ్లాడేది ఈ హీరోయిన్ నేనా?