సెల్ ఫోన్ ఆటల మీద విపరీతమైన మోజు ఉంటె ఇలాంటి ఇబ్బందులే ఎదుర్ అవుతాయి. ప్రస్తుతం పోకే మాన్ గేమ్ ప్రపంచాన్ని ఎలేస్తోంది. ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి చిచ్చు రేపుతోంది అందరికీ తెలిసిందే ఈ గేమ్ ఆడుతూ ఆడుతూ చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉండడం గమనార్హం. ఈ గేమ్ మీద చాలా దేశాలు నిషేధాలి పెట్టగా కొందరు కండిషన్స్ పెట్టారు.
సౌదీ మత పెద్దలు ఏకంగా ఫత్వాని జారీ చేసి దేశం లో ఆ గేమ్ ఆడద్దు అన్ని రూల్ పాస్ చేసారు. ఫ్లోరిడాలోని ఒక న్యూస్ చానెల్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఆ చానల్ లో న్యూస్ ప్రజెంటర్ వాతావరణ వివరాలు చెబుతుండగా.. ఒక మహిళ నేరుగా స్టూడియోలోకి వచ్చేసింది. దీంతో యాంకర్ అండ్ సిబ్బంది షాక్ అయ్యి చూస్తుంటే.. ఆమె మాత్రం తానెక్కడ ఉన్నాను అన్న విషయం మరిచిపోయి మరీ మొబైల్ లో తెగ గేమ్ ఆడేస్తుంది.
ఇప్పటికే అర్ధమయ్యి ఉంటుంది ఆ గేమ్ పోకీమాన్ గో అని. ఈ గేమ్ లోని జాంబీ దెయ్యాని పట్టుకోవడానికి ఆమె అటు ఇటు చక్కర్లు కూడా కొట్టేస్తుంది. ఈమె చిత్రవిచిత్రాలకు బిత్తరపోయిన స్టూడియో సిబ్బంది ఆమెపై కసురుకోవడమే కాకుండా.. ఒకింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు.
Related