న్యూజిలాండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో ధోని పేవలమైన బ్యాటింగ్పై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందె. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకలంటూ ధోనీపై సీనియర్ ఆటగాల్ల విమర్శలను ఇప్పటికె టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటుసునీల్ గవాస్కర్లు మద్దతు పలికారు. ఇప్పుడు తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
అసూయతోనే ధోనిపై కొంతమంది పనిగట్టుకోని విమర్శలు చేస్తున్నారని రవిశాస్త్రి మండిపడ్డారు. వారంతా కుళ్లు.. కుతంత్రాలతో ధోని నాశనం కోసం ఎదురుచూస్తున్నారని ఓ బెంగాళీ స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘కానీ ధోని ఓ దిగ్గజం. అతని కెరీర్ ఎలా మలుచుకోవాలో అతనికి బాగా తెలుసు. భారత జట్టులో ఓ కొత్త ధోనిగా అవతారమెత్తి అద్భుతంగా రాణిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ని ఒక సూపర్ స్టార్.. అతనో ఓ అద్బుతమై ఆటగాడు కాబట్టే టీవీ చానళ్లు ధోని సంబంధించిన చిన్న విషయాన్ని కూడా సంచలనం చేస్తున్నాయి. ధోని 2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తన వన్డే యావరేజ్ 60కి తగ్గలేదని, గత శ్రీలంక, ఆస్ట్రేలియాల సిరీస్ల్లో మ్యాచ్లను గెలిపించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.