వరుస సిరీస్లతో ఆటగాల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని బీసీసీఐ రెండు రోజుల క్రికతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శ్రీలకంతో సిరీస్ ముగిసిన వెంటనె సౌతాఫ్రికా టూర్ మొదలు కానుంది.
కిక్కిరిసిపోయిన షెడ్యూల్ వల్ల దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్కు తాము తగినంతగా సన్నద్ధం కాలేకపోతున్నామని కోహ్లి తేల్చిచెప్పాడు. లంకతో టెస్టు సిరీస్కు తాము తగినంతగా సన్నద్ధం కాలేకపోతున్నామని కోహ్లి తేల్చిచెప్పాడు. శ్రీలంకతో సిరీస్ ముగిసిన రెండురోజులకే దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా బయలుదేరబోతున్న నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు అండగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. క్రికెట్ షెడ్యూల్ విషయంలో కోహ్లి ఆవేదన నిజమేనని అన్నాడు. ‘క్రికెట్ షెడ్యూల్ కోసం కోహ్లి వ్యాఖ్యలు సరైనవే. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు జట్టు సన్నద్ధమవ్వడానికి తగినంత సమయం ఇవ్వాలి’ అని గంగూలీ సూచించాడు. కోహ్లి వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన బీసీసీఐ.. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది.