త్వరలో జరిగే టీ 20 వరల్డ్ కప్లో సత్తాచాటేందుకు అన్ని దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక వన్డే ప్రపంచకప్ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ను ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
అయితే టోర్ని ప్రారంభానికి ఇంకా సమయం ఉండగానే టీమిండియాకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రన్ మిషన్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యువ ఆటగాళ్లు సీనియర్లకు గట్టిపోటి ఇస్తుండగా ఈ దెబ్బకు వీరిలో జట్టులో చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీకి తుదిజట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే టీ20ల్లో విరాట్ ప్రదర్శన కన్సిస్టెంట్గా లేకపోవడంతో అతడిని పక్కకు పెట్టే అవకాశాలే ఎక్కువ అని తెలుస్తోంది.అయితే కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ను పక్కన పెడితే చరిత్రాత్మక తప్పెదం అవుతుందని, బీసీసీఐ అలాంటి పని చేయదని విరాట్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ ఈ నెల 22 నుండి ప్రారంభంకానుండగా ఒకవేళ ఐపీఎల్లో సత్తాచాటితే టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.