టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ప్రమోషన్ పొందారా..?ఆఫ్ఘానిస్తాన్తో జరిగే టీ 20 సిరీస్కు ఓపెనర్గా రానున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూన్ నుండి జరిగే టీ20 వరల్డ్ కప్ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి తుది జట్టులో చోటు కల్పించిన సంగతి తెలిసిందే.ఇక మెగా టోర్నీకి ముందు జరిగే ఆప్ఘానిస్తాన్ టోర్నికి స్టార్ బ్యాట్స్మెన్ విరాట్కు ప్రమోషన్ లభించనుంది.
అఫ్గానిస్తాన్ తో టీమిండిమా మూడు టీ20 సిరీస్లో తలపడనుండగా సాధారణంగా రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. హీట్ మ్యాన్ తో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగేందుకు ప్రస్తుతం ఇద్దరు గట్టిగా పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు రోహిత్తో గిల్ ఓపెనర్గా రాగా ఈ టీ20 సిరీస్కు విరాట్ను ఓపెనర్గా పంపే ఆలోచన చేస్తోంది టీమిండియా మేనేజ్మెంట్. ఎందుకంటే టీ20 లలో మూడో స్థానంలో కంటే ఓపెనర్ గానే కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ ల్లో ఆర్సీబీ తరపున ఓపెనర్ గా మంచి స్కోరు చేశాడు.
రోహిత్ తో పాటు కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగితే ఆ తర్వాత కుర్రాళ్ళైన జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్ అద్భుతంగా రాణించే ఛాన్స్ ఉండటంతో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్లో టీమిండియా బలంగా ఉండటంతో టీ20 సిరీస్ను ఎలాగైన దక్కించుకోవాలనే దిశగా సెలక్టర్లు అడుగులు వేస్తున్నారు.